దేశంలో పెద్ద పార్టీ అయితే ఏంటి గొప్ప.. రాష్ట్రంలో తుస్సే: బీజేపీపై అంబటి విమర్శలు
- ఆత్మకూరు ఉప ఎన్నిక నేపథ్యంలో కార్యకర్తల సమావేశం
- ప్రచారం కోసమే బీజేపీ నేతలు తనపై విమర్శలు చేస్తున్నారన్న అంబటి
- టీడీపీ బరిలో లేదు కాబట్టే బీజేపీ నేతలు కనిపిస్తున్నారని వ్యాఖ్య
ప్రచారం పొందాలన్న ఉబలాటంతోనే తనను ఏదో ఒకటి అంటున్నారని అంబటి అన్నారు. ప్రజాధనంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి చేస్తాయన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గినా అన్ని పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామన్నారు. మరో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీకి లక్ష ఓట్ల మెజార్టీ వచ్చేలా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించాలని కార్యకర్తలకు సూచించారు.