Pawan Kalyan: అప్పటివరకు తిట్టిన నాయకులు ఇప్పుడెందుకు పొగుడుతున్నారో గమనించాలి: పవన్ కల్యాణ్

  • ఆసక్తికర ట్వీట్లు చేసిన పవన్
  • పొగిడే నేతలను చూసి పడిపోవద్దని హితవు
  • అలాంటి నేతలు మారినట్టు భావించరాదని వెల్లడి
  • అలా భావిస్తే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్టేనని స్పష్టీకరణ
Pawan Kalyan interesting tweets

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా స్పందించారు . అప్పటివరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్ గా మనల్ని పొగడడం ప్రారంభిస్తారని, అయితే ఆ పొగడ్తలు చూసి ఆ నాయకుడు మారిపోయాడని, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు కొట్టి, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్టేనని పేర్కొన్నారు. 

అప్పటివరకు తిట్టిన నాయకులు ఇప్పుడెందుకు పొగుడుతున్నారో ఆలోచించాలని పిలుపునిచ్చారు. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి... అది మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తించండి... జర భద్రం! అంటూ పవన్ ట్వీట్ చేశారు.

More Telugu News