Attaullah: ఇమ్రాన్ ఖాన్ కు ఏమైనా జరిగితే ఆత్మాహుతి దాడులే: హెచ్చరించిన ఎంపీ అతావుల్లా

  • తన హత్యకు కుట్ర జరుగుతోందన్న ఇమ్రాన్
  • ఇటీవల ప్రధాని పదవి కోల్పోయిన వైనం
  • ఇమ్రాన్ కు విధేయుడిగా పేరుగాంచిన అతావుల్లా
  • తానే మొదటి ఆత్మాహుతి దాడి చేస్తానని హెచ్చరిక
PTI MP Attaullah warns ruling govt

ప్రధాని పదవి నుంచి దిగిపోయాక ఇమ్రాన్ ఖాన్ తనపై హత్యాయత్నానికి కుట్ర జరుగుతోందని పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐకి చెందిన ఎంపీ అతావుల్లా తీవ్రస్థాయిలో స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ కు ఏమైనా జరిగితే ఆత్మాహుతి దాడులు జరుగుతాయని హెచ్చరించారు. అతావుల్లా... ఇమ్రాన్ ఖాన్ విధేయుడిగా పేరుగాంచారు. 

ఈ నేపథ్యంలో, పాక్ లో ఇటీవల కొలువుదీరిన షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని అతావుల్లా స్పందించారు. ఇమ్రాన్ తలపై ఒక్క వెంట్రుకకు హాని జరిగినా ప్రస్తుత ప్రభుత్వ పాలకులు గానీ, వారి వారసులు గానీ ఈ భూమ్మీద మిగలరు అని స్పష్టం చేశారు. తానే మొదటి ఆత్మాహుతి దాడి చేస్తానని అన్నారు. తన వెనుక వేలాది మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అతావుల్లా కరాచీ నుంచి చట్టసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

More Telugu News