Sri Ram: ఉత్కంఠను రేకెత్తించనున్న'రెక్కీ' .. ఈ నెల 17 నుంచి జీ 5లో!

  • జీ 5 నుంచి 'రెక్కీ' వెబ్ సిరీస్
  • క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ 
  • ముఖ్య పాత్రల్లో శ్రీరామ్ - ధన్య బాలకృష్ణ  
  • ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్
Rekki Web Series

జీ 5 ఓటీటీ తమ ఫ్లాట్ ఫామ్ పై నుంచి ఎప్పటికప్పుడు కొత్తగా వినోదాన్ని అందించడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా విభిన్నమైన కంటెంట్ కలిగిన వెబ్ సిరీస్ లతో సినిమాలను తలపిస్తోంది. ఇంతకుముందు సాయికుమార్  .. రాధిక  ప్రధానమైన పాత్రలుగా రూపొందిన 'గాలివాన' వెబ్ సిరీస్ కి మంచి క్రేజ్ వచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన వెబ్ సిరీస్ ల జాబితాలో మంచి మార్కులు సంపాదించుకున్నదిగా నిలిచింది.  

ఇక ఇప్పుడు జీ 5వారు 'రెక్కీ' అనే పేరుతో మరో వెబ్ సిరీస్ ను వదలడానికి రెడీ అవుతున్నారు. సిల్వర్  స్క్రీన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీరామ్ కొలిశెట్టి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి పోలూరు కృష్ణ దర్శకత్వం వహించాడు. 1990లో తాడిపత్రిలో జరిగిన ఒక హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ హత్య కేసును ఛేదించడానికి ఇన్ స్పెక్టర్ లెనిన్ రంగంలోకి దిగుతాడు. అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేదే కథ. 

క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో .. గ్రామీణ ఫ్యాక్షన్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్ 7 ఎపిసోడ్స్ గా ఉంటుంది. ఒక్కో ఎపిసోడ్ 25 నిమిషాల నిడివిని కలిగి ఉంటుంది. జూన్ 17 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అడుగడుగునా ఈ వెబ్ సిరీస్ ఉత్కంఠను రేకెత్తిస్తుందని దర్శకుడు చెబుతున్నాడు. శ్రీరామ్ .. శివ బాలాజీ .. ఆడుకాలం నరేన్ .. ధన్య బాలకృష్ణ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు..

More Telugu News