Plane: నేపాల్ విమానం మిస్సింగ్ విషాదాంతం... ఓ నది వద్ద కూలిపోయిన వైనం

  • నేపాల్ లో విమాన ప్రమాదం
  • 22 మంది ప్రయాణికులతో బయల్దేరిన విమానం
  • టేకాఫ్ అయిన 15 నిమిషాలకే సంబంధాలు కట్
  • కోవాంగ్ గ్రామం సమీపంలో విమాన శకలాలు!
Missing Nepal plane crashed at a river

నేపాల్ లో 22 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోయింది. తారా ఎయిర్ కు చెందిన ఈ విమానం ఉదయం 9.55 గంటలకు పోఖారాలో టేకాఫ్ తీసుకుంది. 15 నిమిషాల తర్వాత ఈ విమానం గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు కోల్పోయింది. దాంతో ఈ విమానం కోసం తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టారు. చివరికి కోవాంగ్ గ్రామం సమీపంలో లామ్చే నది వద్ద కూలిపోయినట్టు గుర్తించారు. 

విమాన ప్రమాదంపై సమాచారం అందుకున్న నేపాల్ ఆర్మీ సంఘటన స్థలానికి బయల్దేరింది. ఈ విమానంలో 19 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News