దేశంలో కరోనా డైలీ కేసులు ఎన్నంటే..!
- మహమ్మారి బారిన మరో 2,685 మంది
- కరోనాతో మరో 33 మంది మృతి
- యాక్టివ్ కేసుల్లో 494 పెరుగుదల
మరోవైపు దేశంలో నిన్న 2,158 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఆ మొత్తం సంఖ్య 4,26,09,335కి చేరింది. రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైంది. డైలీ పాజిటివిటీ రేటు 0.6 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 0.54 శాతంగా నమోదైంది. మొత్తంగా 193,13,41,918 డోసుల కరోనా వ్యాక్సిన్లను వినియోగించారు. నిన్న ఒక్కరోజే 14,39,466 డోసులు వ్యాక్సిన్ ను ప్రజలకు ఇచ్చారు.