IPL 2022: వ‌ర్షం వ‌ల్ల ఆల‌స్యంగా ఎలిమినేట‌ర్ మ్యాచ్‌... టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ల‌క్నో

lsg wins toss and decides to bowl first
షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్‌లో లీగ్ ద‌శ ముగిసిన నేప‌థ్యంలో జ‌రుగుతున్న ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో భాగంగా బుధ‌వారం రాత్రి 7.30 గంట‌ల‌కు ప్రారంభం కావాల్సిన ఎలిమినేట‌ర్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ఆల‌స్యమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకుని ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టును ఫస్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ‌రికాసేప‌ట్లో ఈ బెంగళూరు జ‌ట్టు త‌న ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నుంది. 

14 సీజ‌న్లుగా టైటిల్ కోసం వేచి చూస్తున్న బెంగ‌ళూరు జ‌ట్టు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న 15వ సీజ‌న్‌లో ఓ మోస్త‌రు ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌ర‌చింది. ఈ క్ర‌మంలోనే మ‌రింత మేర స‌త్తా చాటి తొలి టైటిల్ చేత‌బ‌ట్టాల‌ని ఆ జ‌ట్టు ఉత్సాహంగా ఉంది. అదే స‌మయంలో అరంగేట్రం చేసిన తొలి సీజ‌న్‌లోనే గుజ‌రాత్ టైటాన్స్ మాదిరిగా ల‌క్నో జ‌ట్టు కూడా అద‌ర‌గొట్టే ప్ర‌ద‌ర్శ‌న‌తో రాణించింది.

ఇక ఈ మ్యాచ్‌లో నెగ్గి టైటిల్ రేసులో నిల‌వాల‌న్న క‌సితో కేఎల్ రాహుల్ బృందం పట్టుదలగా వుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జ‌ట్టు టైటిల్ వేట నుంచి త‌ప్పుకోవాల్సి ఉండ‌గా.. గెలిచిన జ‌ట్టుకు ఎలిమినేట‌ర్ 2 మ్యాచ్ ఆడే అవ‌కాశాలుంటాయి. ఇక విశ్లేష‌కుల అంచ‌నా మేర‌కు, ఈ మ్యాచ్‌లో బెంగ‌ళూరు జ‌ట్టు కంటే ల‌క్నో జ‌ట్టుకే విజ‌యావ‌కాశాలు మెరుగ్గా ఉన్నాయ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.
Go Back to Shorts
IPL 2022
Royal Challengers Bangalore
Lucknow Super Giants

More Telugu News