కేన్స్ లో నా బ్రాండ్ ఇదే: పూజా హెగ్డే
- కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో భారతీయం
- కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో భారత బృందం
- ఓ ప్రతినిధిగా కేన్స్ లో అడుగుపెట్టానన్న పూజ
- తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని వ్యాఖ్య
కేన్స్ లో ఇండియన్ పెవిలియన్ ప్రారంభోత్సవం సందర్భంగా పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తానేమీ ప్రత్యేకంగా ఓ బ్రాండ్ తో కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు రాలేదని, భారతదేశమే తన బ్రాండ్ అని స్పష్టం చేసింది. ఈ చలనచిత్రోత్సవంలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని పూజా పేర్కొంది.
"ఓ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చాను. భారతీయ సినిమా వైభవాన్ని ఆస్వాదిస్తున్నాను. నిజాయతీగా చెప్పాలంటే ఓ నటిగా నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను" అని వివరించింది.