ఉదయం పెళ్లి.. అప్పగింతలకు ముందు విషం తాగి నవ వధువు ఆత్మహత్య
- మహబూబ్నగర్లో ఘటన
- అనంతపురం జిల్లా యువకుడితో పెళ్లి నిశ్చయం
- అంత దూరపు సంబంధం చేసుకోనన్న వధువు
- బలవంతంగా పెళ్లి చేసిన వైనం
అయితే, అంతదూరపు సంబంధం తనకు ఇష్టం లేదని లక్ష్మి తన తల్లికి చెప్పింది. అయినప్పటికీ ఆమె మాటలను పెద్దలు పట్టించుకోకుండా నిన్న ఉదయం 9 గంటలకు వివాహం జరిపించారు. అయితే, వివాహం ఇష్టం లేని లక్ష్మి సాయంత్రం అప్పగింతల సమయానికి ముందు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. దీంతో అప్పటి వరకు పెళ్లితో కళకళలాడిన ఇంట్లో విషాదం అలముకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.