RCB: పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగ‌ళూరు

  • బ్రాబౌర్న్ స్టేడియంలో మ్యాచ్‌
  • ఇరు జ‌ట్ల‌కూ కీల‌కంగా మారిన మ్యాచ్‌
  • కాసేప‌ట్లో బ్యాటింగ్ ప్రారంభించ‌నున్న పంజాబ్‌
rcb wins toss and chose field first

ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్‌, బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ మ‌ధ్య మ్యాచ్ జరుగుతోంది. మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగ‌ళూరు జ‌ట్టు తొలుత ఫీల్డింగ్ చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. దీంతో పంజాబ్ జ‌ట్టు మొదట బ్యాటింగ్‌కు దిగ‌నుంది. 

ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియం వేదిక‌గా జరుగుతున్న ఈ మ్యాచ్‌... ఇరు జ‌ట్ల‌కు కీల‌క‌మ‌నే చెప్పాలి. ఇప్ప‌టిదాకా 12 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు జ‌ట్టు 7 విజ‌యాల‌తో 14 పాయింట్లు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో విజ‌యంతో ఈ జ‌ట్టు ప్లే ఆఫ్ అవ‌కాశాల‌ను మ‌రింత‌మేర మెరుగుప‌ర‌చుకునే అవ‌కాశం ఉంది.

ఇక పంజాబ్ విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టిదాకా 11 మ్యాచ్‌లు ఆడిన ఈ జ‌ట్టు 5 విజ‌యాల‌తో 10 పాయింట్లు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో 8వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో విజ‌యంతో త‌న ప్లే ఆఫ్ అవ‌కాశాల‌ను ఈ జ‌ట్టు స‌జీవంగా ఉంచుకోగ‌లుగుతుంది.

More Telugu News