Viral Videos: రైలు కింద ప‌డ‌బోయిన‌ మ‌హిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్.. వీడియో ఇదిగో

  • ఒడిశాలోని భువనేశ్వర్ లో ఘ‌ట‌న‌
  • క‌దులుతోన్న రైలు నుంచి దిగ‌బోయిన మ‌హిళ‌
  • ప‌ట్టుత‌ప్పి ప్లాట్‌ఫాం, రైలు మ‌ధ్య ప‌డ‌బోయిన వైనం
constable saved the life of a lady passenger

క‌దులుతోన్న రైలు నుంచి దిగ‌వ‌ద్ద‌ని రైల్వే శాఖ‌ ఎంత‌గా ప్ర‌చారం చేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌యాణికులు మాత్రం ఇటువంటి ఘ‌ట‌న‌ల‌కే పాల్ప‌డి ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఘ‌ట‌నే ఒడిశాలోని భువనేశ్వర్ లో చోటు చేసుకుంది. రైలు కింద ప‌డ‌బోయిన‌ ఓ మ‌హిళ ప్రాణాలను రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) హెడ్ కానిస్టేబుల్ ఎస్ ముందా కాపాడాడు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీటీవీ కెమెరాలో రికార్డ‌య్యాయి. రైలు క‌దులుతోన్న స‌మ‌యంలో ఓ మ‌హిళ దిగ‌బోతుండ‌గా ప‌ట్టుత‌ప్పి ప్లాట్‌ఫాం, రైలు మ‌ధ్య ప‌డ‌బోయింది. ఈ విష‌యాన్ని గుర్తించిన అక్క‌డి కానిస్టేబుల్ ఆమెను ప్లాట్‌ఫాం మీద‌కు లాగడంతో ప్రాణాపాయం త‌ప్పింది. సదరు కానిస్టేబుల్‌పై అధికారులు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. రైల్వే స్టేష‌న్ల‌లో త‌రుచూ ఇటువంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి.

More Telugu News