AB Venkateswara Rao: ఏపీ స‌చివాల‌యానికి ఏబీవీ... సీఎస్‌ను క‌ల‌వ‌లేక‌పోయిన సీనియ‌ర్ ఐపీఎస్‌

  • పోస్టింగ్ కోసం సెక్ర‌టేరియ‌ట్‌కు ఏబీవీ
  • ఏబీవీని క‌లిసేందుకు ఆస‌క్తి చూప‌ని సీఎస్ 
  • నేడు కూడా సీఎస్‌ను క‌ల‌వ‌కుండానే వెనుదిరిగిన ఏబీవీ
ab venkateswara rao came to ap secretariat to meet cs sameer sharma

ఏపీ కేడ‌ర్ సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు బుధ‌వారం మ‌రోమారు ఏపీ స‌చివాల‌యానికి వెళ్లారు. త‌న‌కు పోస్టింగ్ ఇవ్వాలంటూ ఇదివ‌ర‌కే ఓ ద‌ఫా ఏపీ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ‌ను క‌లిసిన ఏబీవీ.. మంగ‌ళ‌వారం కూడా సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అయితే మంగ‌ళ‌వారం సీఎస్ అందుబాటులో లేక‌పోవ‌డంతో ఆయ‌న‌ను క‌ల‌వ‌కుండానే వ‌చ్చేసిన ఏబీవీ.. తాజాగా బుధ‌వారం కూడా స‌చివాల‌యానికి వెళ్లారు.

అయితే నేడు కూడా సీఎస్ స‌మీర్ శ‌ర్మ‌ను ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు క‌ల‌వ‌లేక‌పోయారు. ఏబీవీని క‌లిసేందుకు సీఎస్ స‌మీర్ శ‌ర్మ అంత‌గా ఆస‌క్తి చూప‌లేదని స‌మాచారం. అయితే నేరుగా త‌న కార్యాల‌యం వ‌ద్ద‌కే ఏబీవీ చేరుకున్న విష‌యాన్ని తెలుసుకున్న స‌మీర్ శ‌ర్మ‌.. ఆయ‌న‌ను వెయిటింగ్ రూంలో కూర్చోబెట్టి.. సచివాల‌యం నుంచి వెళ్లిపోయిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో బుధ‌వారం కూడా సీఎస్‌ను క‌ల‌వ‌కుండానే ఏబీవీ వెనుదిర‌గాల్సి వ‌చ్చింది.

More Telugu News