India: ఇండియాలో 20 వేలకు చేరువవుతున్న కరోనా యాక్టివ్ కేసులు

Corona active cases in India reaching 20K
షార్ట్స్‌లో చూడండి
దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి కంటే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్యే ఎక్కువగా ఉంది. నిన్న కూడా 3 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,205 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 2,802 మంది కోలుకోగా... 31 మంది మృతి చెందారు. 

ఇక తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,30,88,118కి చేరుకుంది. ఇప్పటి వరకు 4,25,44,689 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 5,23,920కి చేరింది. ప్రస్తుతం దేశంలో 19,509 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

కోలుకుంటున్న వారి కంటే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో... దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. మరణాల రేటు 1.22 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 1,89,48,01,203 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.
Go Back to Shorts
India
Corona Virus
Updates

More Telugu News