ముస్లింలు ప్రపంచవ్యాప్తంగా హింసకు గురవుతున్నారు: జో బైడెన్ ఆవేదన
- రంజాన్ సందర్భంగా వైట్ హౌస్ లో వేడుకలు
- మత విశ్వాసాల ఆధారంగా ఎవరిపైనా వివక్ష చూపకూడదన్న జో బైడెన్
- అమెరికా అభివృద్ధికి ముస్లింలు పాటుపడుతున్నారని కితాబు
ఉయిగర్లు, రోహింగ్యాలతో పాటు హింస, దుర్భిక్షం, అంతర్యుద్ధాలు ఎదుర్కొంటున్న వారు నేడు రంజాన్ జరుపుకోలేకపోవచ్చని, అలాంటివారందరినీ తాము స్మరించుకుంటున్నామని వివరించారు. సమాజంలో ఎన్నో సవాళ్లు, సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ ముస్లింలు అమెరికా అభ్యున్నతి కోసం ప్రతి రోజు శ్రమిస్తున్నారని కొనియాడారు.
కాగా, ప్రపంచ చరిత్రలో మతం, జాతి, పుట్టుక, ప్రాంతీయతలను పట్టించుకోని సిద్ధాంతాల ఆధారంగా ఏర్పాటైన దేశం అమెరికా ఒక్కటే అని బైడెన్ ఉద్ఘాటించారు. కేవలం ఒక అవగాహన ప్రాతిపదికగానే అమెరికా ఏర్పడిందని పేర్కొన్నారు.