KTR: దేశంలో మో'డెమోక్ర‌సీ'.. ప్రధానిపై కేటీఆర్ చురక

ktr harsh comments on pm narendra modi
షార్ట్స్‌లో చూడండి
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దేశంలో అమ‌లు అవుతున్న‌ది డెమోక్ర‌సీ కాద‌ని, ఇది మోదీ మార్కు డెమోక్ర‌సీ అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. యావ‌త్తు దేశాన్ని ఒకే దృష్టితో చూడాల్సిన ప్ర‌ధాని మోదీ... అందుకు విరుద్ధంగా త‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్ కోస‌మే ప‌నిచేస్తున్నార‌ని కూడా కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేర‌కు తెలంగాణ ప‌ట్ల కేంద్రం స‌వతి త‌ల్లి ప్రేమ చూపుతోందంటూ కేటీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

వ‌రంగ‌ల్‌కు కేంద్రం ప్ర‌క‌టించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇప్ప‌టికీ రాక‌పోగా.. గుజ‌రాత్‌కు మాత్రం ఎల‌క్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్ ప్రాజెక్టును ప్ర‌క‌టిస్తూ కేంద్రం ఇటీవలే కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ప్ర‌క‌ట‌న‌పై తెలంగాణ‌కు చెందిన రాజ‌కీయ విశ్లేష‌కుడు ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ పోస్ట్ పెట్టారు. దానిని ఉద‌హ‌రిస్తూ మోదీపై కేటీఆర్ విరుచుకుప‌డ్డారు.

దేశంలో మో'డెమోక్ర‌సీ' అమ‌లులో ఉంద‌ని చెప్పిన కేటీఆర్‌... ప్ర‌ధాని మోదీ దృష్టి మొత్తం గుజ‌రాత్ అభివృద్ధిపై ఉంద‌ని దెప్పి పొడిచారు. ఆఫ్ గుజ‌రాత్‌, బై గుజ‌రాత్‌, ఫ‌ర్ గుజ‌రాత్‌, టూ గుజ‌రాత్ అన్న సూత్రంతోనే మోదీ ప‌నిచేస్తున్నార‌ని కేటీఆర్ విమ‌ర్శించారు. పార్ల‌మెంటు సాక్షిగా వ‌రంగ‌ల్‌కు ఇస్తామ‌న్న లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్ట‌రీ హామీని మోదీ తుంగ‌లో తొక్కార‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.
Go Back to Shorts
KTR
TRS
Prime Minister
Narendra Modi
Warangal
Locomotive Coach Factory

More Telugu News