గుడివాడ మట్టి మాఫియాపై చర్యలు.. 10 మందిపై కేసు, జేసీజీ సీజ్
- గుడివాడలో అక్రమ మట్టి తవ్వకాలు
- అడ్డుకునేందుకు యత్నించిన ఆర్ఐపై దాడి
- చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం
ఆర్ఐ అరవింద్పై దాడికి దిగిన 10 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసి, మట్టి తవ్వకాలకు వినియోగిస్తున్న జేసీబీని సీజ్ చేశారు. అంతేకాకుండా మట్టిని తరలించేందుకు వినియోగిస్తున్న 3 ట్రాక్టర్లను కూడా అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటనపై విపక్ష టీడీపీ కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.