Telangana: తెలంగాణలో కొత్తగా 30 మందికి కరోనా

Telangana corona media bulletin
  • గత 24 గంటల్లో 16,267 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 17 కొత్త కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న 41 మంది
  • ఇంకా 260 మందికి చికిత్స

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 16,267 శాంపిల్స్ పరీక్షించగా, 30 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాదులో అత్యధికంగా 17 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 41 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,375 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,004 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 260 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

  • Loading...

More Telugu News