Social Media: శ్రీలంక వ్యాప్తంగా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, యూట్యూబ్ సేవలపై నిషేధం
- శ్రీలంకలో తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభం
- నిరసనలతో హోరెత్తిస్తోన్న ఆందోళనకారులు
- తప్పుడు ప్రచారం వ్యాప్తి చెందకుండా చర్యలు
శ్రీలంకలో తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో ఆ దేశ వ్యాప్తంగా ఆందోళనకారులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడడానికి శ్రీలంక ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే శ్రీలంక వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. ఆందోళనల వేళ అసత్య ప్రచారాన్ని అరికట్టేందుకు శ్రీలంకలో సామాజిక మాధ్యమాలపై నిషేధం విధిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది.
గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ సేవలు శ్రీలంక వ్యాప్తంగా నిలిచిపోయాయి. కాగా, నిత్యావసరాల ధరలు ఊహించని రీతిలో పెరిగిపోవడంతో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆ దేశ ప్రజలు ఆందోళనలను ఉద్ధృతం చేశారు.
శ్రీలంక భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలు ఇవ్వడంతో ఆ దేశంలో ఎప్పుడు ఏ పరిస్థితులు తలెత్తుతాయోనని ఆందోళన నెలకొంది. ఎవరైనా నిరసన ప్రదర్శనలకు దిగితే వారిని అదుపులోకి తీసుకోవాలని శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
అయితే, సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడాన్ని ఆ దేశ యువజన, క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స ఖండించారు. ఇటువంటి చర్యలను తాను ఎప్పటికీ సమర్థించబోనని చెప్పారు. దేశంలో ఆందోళనలు అణచివేయడానికి పెట్టిన ఇలాంటి ఆంక్షలు పనిచేయవని అభిప్రాయపడ్డారు. అధికారులు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
గత అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సప్, యూట్యూబ్ సేవలు శ్రీలంక వ్యాప్తంగా నిలిచిపోయాయి. కాగా, నిత్యావసరాల ధరలు ఊహించని రీతిలో పెరిగిపోవడంతో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేయాలంటూ ఆ దేశ ప్రజలు ఆందోళనలను ఉద్ధృతం చేశారు.
శ్రీలంక భద్రతా బలగాలకు అపరిమిత అధికారాలు ఇవ్వడంతో ఆ దేశంలో ఎప్పుడు ఏ పరిస్థితులు తలెత్తుతాయోనని ఆందోళన నెలకొంది. ఎవరైనా నిరసన ప్రదర్శనలకు దిగితే వారిని అదుపులోకి తీసుకోవాలని శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
అయితే, సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడాన్ని ఆ దేశ యువజన, క్రీడా శాఖ మంత్రి నమల్ రాజపక్స ఖండించారు. ఇటువంటి చర్యలను తాను ఎప్పటికీ సమర్థించబోనని చెప్పారు. దేశంలో ఆందోళనలు అణచివేయడానికి పెట్టిన ఇలాంటి ఆంక్షలు పనిచేయవని అభిప్రాయపడ్డారు. అధికారులు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.