హై అలర్ట్!.. ప్రధానిని హత్య చేస్తానని అగంతుకుడి ఈ మెయిల్!
- వీలయినంత త్వరగా మోదీని చంపుతా
- దేశంలో 20 చోట్ల భారీ దాడులకు ప్లాన్
- ఉగ్రవాదుల సహకారంతో 20 కిలోల ఆర్డీఎక్స్ సేకరణ
- ఇప్పటికే 20 స్లీపర్ సెల్స్ను రంగంలోకి దించా
- ఈ-మెయిల్ లేఖలో అగంతుకుడు వెల్లడి
తన వద్ద 20 కిలోల ఆర్డీఎక్స్ ఉన్నట్లు వెల్లడించిన అగంతుకుడు.. ఆర్డీఎక్స్ సేకరణకు తనకు కొందరు ఉగ్రవాదులు సహకరించినట్టు తెలిపాడు. వీలయినంత త్వరగా ప్రధానిని చంపేస్తానని అతడు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 20 చోట్ల దాడులకు కుట్ర చేసినట్లు అతడు వెల్లడించాడు. ఈ దాడులతో దేశంలో 2 కోట్ల మందిని చంపుతానంటూ బెదిరించాడు. ఇందుకోసం చాలా కాలం నుంచే పథకం రచించినట్టు అతడు వెల్లడించారు. ఈ దాడుల కోసం తాను 20 స్లీపర్ సెల్స్ను రంగంలోకి దించానని కూడా ఆ ఆగంతుకుడు వెల్లడించాడు.