Yanamala: పక్క‌దారి ప‌ట్టిన నిధుల‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాలి: య‌న‌మ‌ల డిమాండ్‌

yanamala demands cbi enquiry on 48 thousand crores
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు పాల‌న‌లో ఇప్ప‌టిదాకా ఖ‌ర్చు అయిన నిధుల్లో రూ.48 వేల కోట్ల‌కు అస‌లు లెక్క‌లే లేవ‌ని విప‌క్ష టీడీపీ ఆరోపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని తొలుత టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మ‌న్ ప‌య్యావుల కేశ‌వ్ బ‌య‌ట‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశాన్ని శ‌నివారం ప్ర‌స్తావించిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడు.. ఈ వ్య‌వ‌హారంపై సీబీఐ చేత విచార‌ణ చేయించాల‌ని డిమాండ్ చేశారు.

ప‌క్క‌దారి ప‌ట్టిన నిధుల్లో మెజారిటీ వాటా కేంద్రం నుంచి వ‌చ్చిన‌వేన‌ని చెప్పిన య‌న‌మ‌ల‌.. ఈ అవక‌త‌వ‌క‌ల‌ను తేల్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వ‌మే సీబీఐ విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేయాల‌ని డిమాండ్ చేశారు. ప‌క్క‌దారి పట్టిన నిధులు ఎవ‌రి చేతుల్లోకి వెళ్లాయ‌నే అంశాన్ని తేల్చాల్సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వంపై ఉంద‌ని కూడా య‌న‌మ‌ల గుర్తు చేశారు.
Go Back to Shorts
Yanamala
Andhra Pradesh
CAG
CBI

More Telugu News