విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా వైసీపీ వినూత్న నిరసన
- 120 మంది ఎంపీలతో సంతకాల సేకరణ
- లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు ఒప్పుకోం
- ప్రధాని మోదీకి సంతకాలను అందజేస్తామన్న సాయిరెడ్డి
ఈ మేరకు మంగళవారం నాడు పార్లమెంటులో సమావేశమైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వివరాలు వెల్లడించారు. లాభాల్లో ఉన్న , లాభాల్లోకి వచ్చే అవకాశం ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని ఆయన చెప్పారు. ఈ విషయంలో అన్ని పార్టీలను కలుపుకొనిపోతామని చెప్పిన ఆయన.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 120 మంది ఎంపీల సంతకాలు సేకరించి ప్రధానమంత్రికి నివేదిస్తామని వెల్లడించారు.