Andhra Pradesh: ఏపీలో కొత్తగా 749 మందికి కరోనా... పూర్తి వివరాలు ఇవిగో!

  • ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • గత 24 గంటల్లో 22,785 కరోనా పరీక్షలు
  • తూర్పు గోదావరి జిల్లాలో 128 కేసులు
  • రాష్ట్రంలో ముగ్గురి మృతి
  • ఇంకా 18,929 మందికి చికిత్స
AP Corona Media Bulletin

ఏపీలో గడచిన 24 గంటల్లో 22,785 శాంపిల్స్ పరీక్షించగా, 749 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 125 కేసులు నమోదు కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 120 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 2 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 6,271 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,12,778 మంది కరోనా బారినపడగా, వారిలో 22,79,152 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 18,929 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,697కి పెరిగింది.

More Telugu News