రెండేళ్లు దేశ సరిహద్దులను మూసేసుకున్నా.. చివరికి కరోనాకు చిక్కిన ‘కిరిబటి’!
28-01-2022 Fri 12:57
- ఈ నెలలోనే సరిహద్దులను తెరిచిన దేశం
- క్రైస్తవ మత బోధకులకు ఆహ్వానం
- తిరిగొచ్చిన 54 మంది
- సగం మందికి పాజిటివ్
- 181కు పెరిగిన కేసుల సంఖ్య

యావత్ ప్రపంచం కరోనా మహమ్మారితో వణికిపోతుంటే పసిఫిక్ ప్రాంతంలోని ద్వీప సమూహ దేశం కిరిబటి ముందే మేల్కొంది. వెంటనే తన సరిహద్దులను మూసేసింది. తన తీరానికి కరోనా చేరకుండా రెండేళ్లపాటు చాలా కట్టుదిట్టంగా వ్యవహరించింది. అయినా, చివరికి కరోనా మహమ్మారి ఆ దేశాన్ని వదల్లేదు.
రెండేళ్లపాటు ఓపిక పట్టిన కిరిబటి చివరికి తన సరిహద్దులను తాజాగా తెరవడంతో మహమ్మారిని ఆహ్వానించినట్టయింది. విదేశాలలో నిలిచిపోయిన క్రైస్తవ మత బోధకులు చార్టర్ విమానంలో తిరిగి వచ్చేందుకు కిరిబటి ఈ నెలలోనే అనుమతించింది. దీంతో 54 మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరంతా సరిహద్దులను మూసివేయడానికి ముందు కిరిబటి నుంచి విదేశీ మిషనరీలకు వెళ్లినవారు.
తిరిగి వచ్చిన ప్రతి ప్రయాణికుడిని ఫిజీకి సమీపంలోనే మూడు సార్లు టెస్ట్ చేసి అనుమతించింది. దేశానికి తిరిగొచ్చిన తర్వాత క్వారంటైన్ కూడా చేసింది. కానీ, ఎక్కడో తేడా కొట్టింది. తిరిగొచ్చిన వారిలో సగానికిపైగా వైరస్ పాజిటివ్ అని తర్వాత తేలింది. అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు సామాజిక వ్యాప్తి దశకు చేరిపోయింది. శుక్రవారం నాటికి కేసుల సంఖ్య 181కి చేరింది.
కిరిబటి జనాభా 1,13,000 మందిలో 33 శాతం మందికే రెండు డోసుల టీకా ఇవ్వడం పూర్తయింది. 59 శాతం మందికి ఒక డోస్ ఇచ్చారు. ప్రపంచం నలుమూలలకూ కరోనా విస్తరించినందున ఇక దీని బారిన పడకుండా ఉండడం కష్టమేనని, టీకాలతోనే రక్షణ ఉంటుందని న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ యూనివర్సిటీ టీకాల నిపుణుడు పెటోసిస్ హారిస్ అన్నారు.
రెండేళ్లపాటు ఓపిక పట్టిన కిరిబటి చివరికి తన సరిహద్దులను తాజాగా తెరవడంతో మహమ్మారిని ఆహ్వానించినట్టయింది. విదేశాలలో నిలిచిపోయిన క్రైస్తవ మత బోధకులు చార్టర్ విమానంలో తిరిగి వచ్చేందుకు కిరిబటి ఈ నెలలోనే అనుమతించింది. దీంతో 54 మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. వీరంతా సరిహద్దులను మూసివేయడానికి ముందు కిరిబటి నుంచి విదేశీ మిషనరీలకు వెళ్లినవారు.
తిరిగి వచ్చిన ప్రతి ప్రయాణికుడిని ఫిజీకి సమీపంలోనే మూడు సార్లు టెస్ట్ చేసి అనుమతించింది. దేశానికి తిరిగొచ్చిన తర్వాత క్వారంటైన్ కూడా చేసింది. కానీ, ఎక్కడో తేడా కొట్టింది. తిరిగొచ్చిన వారిలో సగానికిపైగా వైరస్ పాజిటివ్ అని తర్వాత తేలింది. అంతటితో ఆగిపోలేదు. ఇప్పుడు సామాజిక వ్యాప్తి దశకు చేరిపోయింది. శుక్రవారం నాటికి కేసుల సంఖ్య 181కి చేరింది.
కిరిబటి జనాభా 1,13,000 మందిలో 33 శాతం మందికే రెండు డోసుల టీకా ఇవ్వడం పూర్తయింది. 59 శాతం మందికి ఒక డోస్ ఇచ్చారు. ప్రపంచం నలుమూలలకూ కరోనా విస్తరించినందున ఇక దీని బారిన పడకుండా ఉండడం కష్టమేనని, టీకాలతోనే రక్షణ ఉంటుందని న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ యూనివర్సిటీ టీకాల నిపుణుడు పెటోసిస్ హారిస్ అన్నారు.
More Telugu News


తెలంగాణలో నేటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
11 minutes ago

ఢిల్లీలో అఖిలేశ్ యాదవ్తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం
34 minutes ago

ఇన్ఫినిక్స్ నోట్ 12, నోట్ 12 టర్బో విడుదల
44 minutes ago


ఒమిక్రాన్ బీఏ 4 రెండో కేసు తమిళనాడులో
1 hour ago

దసరా రేసులో నిఖిల్ .. 'స్పై'
2 hours ago

పవన్ పాత్రపై క్లారిటీ ఇచ్చిన హరీశ్ శంకర్!
3 hours ago

కొండెక్కుతోన్న టమాటా ధరలు
3 hours ago
Advertisement
Video News

Sarkaru Vaari Paata team: Unfiltered conversation between Mahesh Babu and fans
10 minutes ago
Advertisement 36

Cong fighting to regain India from BJP-RSS, says Rahul at Cambridge varsity
25 minutes ago

Apart from entertainment, movies should impart knowledge: Venkaiah
51 minutes ago

Yoddha song Telugu teaser from Prithviraj - Akshay Kumar, Manushi
1 hour ago

Pawan Kalyan laughs as power goes off while interacting with media
2 hours ago

Full video song ‘Meenaacchee’ from Bhala Thandhanana ft. Sree Vishnu, Catherine Tresa
3 hours ago

Black official trailer- Aadi Sai Kumar
3 hours ago

KA Paul 'Open Heart With RK'- Promo
4 hours ago

7 AM Telugu News: 21st May 2022
5 hours ago

Case filed against Amitabh, Shah Rukh, Ajay Devgn, Ranveer for promoting ‘Gutkha’: Key details
5 hours ago

CM KCR national tour schedule released
6 hours ago

Elon Musk facing se*ual harassment on a flight attendant
6 hours ago

Zee Mahotsavam 2022 Promo- Venkatesh, Varun Tej, Anil Ravipudi- May 22nd, 6 PM
7 hours ago

Did not start the fight: Superstar Kichcha Sudeep on language row
7 hours ago

9 PM Telugu News- 20th May 2022
15 hours ago

Corona Virus BA 4 variant; First case witnessed in Hyderabad
16 hours ago