BCCI: వెస్టిండీస్ తో వన్డేలు, టీ20లకు వేదికలు మార్చిన బీసీసీఐ

  • భారత్ లో కరోనా వ్యాప్తి
  • ఫిబ్రవరిలో టీమిండియా-వెస్టిండీస్ మధ్య వన్డేలు, టీ20లు
  • వన్డే మ్యాచ్ లన్నీ నరేంద్ర మోదీ స్టేడియంలో నిర్వహణ
  • టీ20 సిరీస్ కు ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం
BCCI changes venues for matches with West Indies

ఫిబ్రవరిలో వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా వెస్టిండీస్ జట్టు టీమిండియాతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. అయితే భారత్ లో కరోనా విజృంభణను దృష్టిలో ఉంచుకుని టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ ల వేదికల్లో బీసీసీఐ మార్పులు చేసింది.

మూడు వన్డేలు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతాయని, మూడు టీ20 మ్యాచ్ లు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతాయని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 6, 9, 11 తేదీల్లో వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. ఫిబ్రవరి 16, 18, 20 తేదీల్లో టీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.

More Telugu News