Sumanth: ఓటీటీలో వస్తున్న 'మళ్లీ మొదలైంది'

  • సుమంత్ తాజా చిత్రం 'మళ్లీ మొదలైంది'
  • వర్షిణీ సౌందర్ రాజన్, నైనా గంగూలీ హీరోయిన్లు 
  • ఫిబ్రవరిలో జీ5లో విడుదల కానున్న చిత్రం
Sumanths Malli Modalaindi movie to release in OTT

సుమంత్ నటించిన తాజా చిత్రం 'మళ్లీ మొదలైంది' ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో సుమంత్ భార్య పాత్రలో వర్షిణీ సౌందర్ రాజన్ నటించింది. విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితోనే ప్రేమలో పడితే ఏంటనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.

మహిళా న్యాయవాది పాత్రలో నైనా గంగూలీ నటించింది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టీజీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 సంస్థ దక్కించుకుంది. రేపు జీ5 ఓటీటీలో 'లూజర్' సీజన్ 2 స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. అనంతరం 'మళ్లీ మొదలైంది'తో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.

More Telugu News