365 రకాల వంటకాలతో కాబోయే వధూవరులకు తాతయ్య సంక్రాంతి విందు
- భీమవరానికి చెందిన కుందవికి తణుకుకు చెందిన సాయికృష్ణతో వివాహ నిశ్చయం
- సంక్రాంతికి ఇంటికి ఆహ్వానించిన కుందవి తాతయ్య
- ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా మారిన విందు
సంక్రాంతి పండుగ సందర్భంగా వధూవరులను తన ఇంటికి ఆహ్వానించారు నరసాపురం పట్టణానికి చెందిన కుందవి తాతయ్య ఆచంట గోవిందు-నాగమణి దంపతులు. ఇంటికి వచ్చిన కాబోయే జంటకు జీవితాంతం గుర్తుండేలా విందు ఇచ్చారు. 365 రకాల వంటకాలను వడ్డించారు. 100 రకాల స్వీట్స్, పులిహోర, దద్దోజనం, 30 రకాల కూరలు, రకరకాల పిండి వంటలను రుచి చూపించారు. తాతయ్య ఇచ్చిన విందుకు వధూవరులు ఫిదా అయిపోయారు. తాతయ్య తమపై చూపించిన ప్రేమాభిమానానికి కుందవి, సాయికృష్ణ కదిలిపోయారు.