Pinarayi Vijayan: హైదరాబాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో కేరళ ముఖ్యమంత్రి విజయన్ భేటీ

Kerala CM Pinarayi Vijayan met Telangana CM KCR at Pragathi Bhavan
  • హైదరాబాదులో సీపీఎం సమావేశాలు
  • నగరానికి వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్
  • విజయన్ ను లంచ్ కు ఆహ్వానించిన సీఎం కేసీఆర్
  • విజయన్ వెంట సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హైదరాబాద్ విచ్చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు నగరంలోనే జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో సీఎం విజయన్ కూడా పాల్గొంటున్నారు. కాగా, నగరానికి వచ్చిన కేరళ సీఎంను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మర్యాదపూర్వకంగా మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ను పినరయి విజయన్ ప్రగతి భవన్ లో కలిశారు. కాగా, విజయన్ వెంట సీతారాం ఏచూరి (సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి), సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కారత్ కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News