Nitin Gadkari: ఢిల్లీలో నితిన్ గ‌డ్క‌రీతో జ‌గ‌న్ భేటీ

  • ఏపీలో ర‌హ‌దారుల నిర్మాణంపై చ‌ర్చ‌
  • తీర ప్రాంతం వెంబ‌డి ర‌హ‌దారుల నిర్మాణం చేప‌ట్టాల‌ని విన‌తి
  • విశాఖ‌-భోగాపురం జాతీయ ర‌హ‌దారి నిర్మాణంపై చ‌ర్చ
jagan meets gadkari

ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ రెండో రోజు పర్యటన కొన‌సాగుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్క‌రీతో జ‌గ‌న్ స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చిస్తున్నారు. ఏపీలో ర‌హ‌దారుల నిర్మాణం, జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌పై ఆయ‌న గ‌డ్క‌రీతో మాట్లాడుతున్నారు. తీర ప్రాంతం వెంబ‌డి నాలుగు లైన్ల ర‌హ‌దారుల నిర్మాణం చేప‌ట్టాల‌ని ఆయ‌న కోరారు. విశాఖ‌-భోగాపురం జాతీయ ర‌హ‌దారి నిర్మాణంపై చ‌ర్చించారు.

విజ‌య‌వాడ తూర్పు హైవే ఏర్పాటుపై కూడా జ‌గ‌న్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. అలాగే, ఏపీలోని పెండింగ్ ప్రాజెక్టుల‌కు త్వ‌ర‌గా అనుమ‌తులు మంజూరు చేయాల‌ని ఆయ‌న కోరుతున్నారు. కాగా, కాసేప‌ట్లో జ‌గ‌న్ మ‌రికొంత మంది కేంద్ర మంత్రులు, అధికారుల‌తో స‌మావేశమై ఏపీకి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు.

  • Loading...

More Telugu News