ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్
- రిటైర్డ్ ఐఏఎస్ అధికారి లక్ష్మీనారాయణ ఇంట్లో ఈ నెల 10న సోదాలు
- సీఐడీ ఎస్సై ఫిర్యాదుపై మంగళగిరిలో కేసు
- నిందితులుగా న్యాయవాది, ఏబీఎన్ కెమెరామన్, రిపోర్టర్
- జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు కేసు ట్రాన్స్ఫర్ కోసం ప్రతిపాదన
రాధాకృష్ణపై నమోదు చేసిన జీరో ఎఫ్ఐఆర్ను గుంటూరులోని ఆరో అదనపు జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానంలో సమర్పించామని, తదుపరి విచారణ కోసం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ హౌస్ అధికారికి కేసును ట్రాన్స్ఫర్ చేసేందుకు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ నెల 10న ఈ ఘటన జరగ్గా 11న సాయంత్రం ఏడు గంటలకు అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో వివరించారు.