జవాద్ తుపానుపై ఐఎండీ అప్ డేట్.. ఏపీలోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
- విశాఖకు 210 కిలోమీటర్ల దూరంలో తుపాను
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం
- తరలింపులను ముమ్మరం చేసిన ఏపీ, ఒడిశా
- రేపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం
రాబోయే 12 గంటల్లో పూరీ తీరానికి చేరి తీవ్రమైన వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఏపీ, ఒడిశా అధికారులు తరలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు ఇవాళ రెడ్ అలర్ట్ ను జారీ చేశారు. ఒడిశాలోని గజపతి, గంజాం, పూరీ, జగత్ సింగ్ పూర్ లకూ రెడ్ అలర్ట్ ను ఇచ్చారు.