GHMC: గ్రేటర్ హైదరాబాదులో మరో 75 మందికి కరోనా

Greater Hyderabad corona update
  • గత 24 గంటల్లో 38,731 కరోనా పరీక్షలు
  • తెలంగాణలో కొత్తగా 171 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,534 మందికి చికిత్స
తెలంగాణలో గత 24 గంటల్లో 38,731 కరోనా పరీక్షలు నిర్వహించగా, 171 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క గ్రేటర్ హైదరాబాదు పరిధిలోనే 75 కొత్త కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో 15, కరీంనగర్ జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 11 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 167 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,75,319 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,67,798 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,534 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,987కి పెరిగింది.
GHMC
Corona
Positive Cases
Today Cases
Telangana

More Telugu News