దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా మరణాలు
- నిన్న దేశవ్యాప్తంగా 313 మంది మృతి
- కొవిడ్తో ఇప్పటి వరకు 4,65,662 మంది కన్నుమూత
- 536 రోజులకు పడిపోయిన యాక్టివ్ కేసులు
నిన్న 12,329 మంది కరోనా నుంచి బయటపడ్డారు. వీరితో కలుపుకుని ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3.39 కోట్లు దాటింది. ఈ స్థాయిలో రికవరీలు పెరగడం గతేడాది మార్చి తర్వాత ఇదే తొలిసారి. యాక్టివ్ కేసులు కూడా గణనీయంగా తగ్గాయి. ఇవి 0.36 శాతానికి తగ్గి 536 రోజుల కనిష్ఠానికి పడిపోయాయి. ప్రస్తుతం 1,22,714 మంది కరోనాతో బాధపడుతున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 10,74,099 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తన బులెటిన్లో పేర్కొంది.