Nellore District: ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఏపీలో ప్రారంభమైన మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు

  • నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మునిసిపాలిటీల ఓట్ల లెక్కింపు ప్రారంభం
  • మరో గంటలో తెలిసిపోనున్న ఓటింగ్ సరళి
  • సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం
municipal Elections votes counting started in Andhrapradesh

ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. సాధారణ ఎన్నికలను తలపించిన ఈ ఎన్నికల ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. నెల్లూరు నగరపాలక సంస్థ, కుప్పం సహా 12 మునిసిపాలిటీలతోపాటు సోమవారం పోలింగ్ జరిగిన అన్ని చోట్ల ఈ లెక్కింపు ప్రారంభమైంది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, పది గంటలకల్లా ఓటింగ్ సరళి తెలిసిపోనుంది. సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

More Telugu News