Andhra Pradesh: ఏపీలో గత 24 గంటల్లో 231 కరోనా కేసుల నమోదు

  • గత 24 గంటల్లో 31,054 కరోనా పరీక్షలు
  • చిత్తూరు జిల్లాలో 37 మందికి పాజిటివ్
  • రాష్ట్రంలో ఇద్దరి మృతి
  • ఇంకా 3,233 మందికి చికిత్స
AP Corona cases and deaths

ఏపీలో గడచిన 24 గంటల్లో 31,054 కరోనా పరీక్షలు నిర్వహించగా, 231 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో 37, తూర్పు గోదావరి జిల్లాలో 36, గుంటూరు జిల్లాలో 31 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 362 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా, ఇద్దరు మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 20,68,718 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,51,082 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,233 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,403కి పెరిగింది.

  • Loading...

More Telugu News