పోడు భూములపై మంత్రి కేటీఆర్ సమీక్ష... అధికారులకు సీరియస్ వార్నింగ్
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు భూముల అవగాహన సదస్సు
- హాజరైన మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యేలు
- తప్పులు చేస్తే ఉద్యోగాలు ఊడతాయన్న కేటీఆర్
- రాజకీయాలకు అతీతంగా వెళుతున్నామని వెల్లడి
పోడు భూముల పేరిట డబ్బులు వసూలు చేస్తే జైలు తప్పదని, హక్కు పత్రాల పేరుతో అక్రమాలు చేస్తే కఠినచర్యలు ఉంటాయని అన్నారు. అధికారులు తప్పులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, ఉద్యోగాల నుంచి తొలగించడం ఖాయమని హెచ్చరించారు. రాజకీయాలకు అతీతంగా ఈ కార్యాచరణ చేపడుతున్నామని, ఇందులో తమ ప్రభుత్వానికి మరో ఉద్దేశమేమీ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ అవగాహన సదస్సుకు ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, రమేశ్ బాబు కూడా హాజరయ్యారు.