Pakistan: గ్రూప్-2లో మరో విజయంపై కన్నేసిన పాకిస్థాన్... పసికూన నమీబియాతో పోరు

  • అబుదాబిలో పాక్ వర్సెస్ నమీబియా
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
  • ఇప్పటికే 3 మ్యాచ్ లలో గెలిచిన పాక్ జట్టు
  • నమీబియాపై గెలిస్తే సెమీస్ బెర్తు ఖరారు
Pakistan eyes on another win

యూఏఈలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు అంచనాలకు మించి రాణిస్తోంది. సూపర్-12 దశలో గ్రూప్-2లో ఇప్పటిదాకా తాను ఆడిన 3 మ్యాచ్ లలోనూ నెగ్గిన పాక్ నేడు పసికూన నమీబియాతో ఆడుతోంది. అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ అజాం బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

కాగా ఈ మ్యాచ్ గెలిస్తే పాకిస్థాన్ జట్టుకు సెమీఫైనల్ బెర్తు ఖరారవుతుంది. పాక్ జట్టు ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్ట్యా విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.

More Telugu News