Etela Rajender: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితాలు: ఏడో రౌండ్లోనూ ఈటలదే హవా
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఏడో రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధిక్యత కనబర్చారు. ఏడో రౌండ్లో ఆయన 246 ఓట్ల ఆధిక్యం సాధించారు. మొత్తం ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటలకు 3,432 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఏడో రౌండ్లో బీజేపీకి 4,038, టీఆర్ఎస్కు 3,792, కాంగ్రెస్కు 94 ఓట్లు దక్కాయి. ఏడు రౌండ్ల తర్వాత బీజేపీకి 31,021, టీఆర్ఎస్కు 27,589 ఓట్లు, కాంగ్రెస్కు 1,086 ఓట్లు దక్కాయి.