భారత్ లో ఎలాన్ మస్క్ కొత్త వ్యాపారం... వివరాలు ఇవిగో!
- వ్యాపార విస్తరణకు మస్క్ నిర్ణయం
- భారత్ లో బ్రాడ్ బ్యాండ్ సేవలు
- స్టార్ లింక్ సంస్థ ద్వారా ఇంటర్నెట్
- వచ్చే ఏడాది డిసెంబరు నాటికి సేవలు
భారత కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతుల కోసం వేచిచూస్తున్నట్టు స్టార్ లింక్ భారత విభాగం డైరెక్టర్ సంజయ్ భార్గవ తెలిపారు. ఇప్పటికే 5 వేలకు పైగా ప్రీబుకింగ్ లు నమోదయ్యాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ బ్రాండ్ బ్యాండ్ సేవలు అందించడంపై ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు.
వచ్చే ఏడాది డిసెంబరు నాటికి దేశంలో 2 లక్షల క్రియాశీలక టెర్మినళ్లను కలిగి ఉండడం తమ ప్రణాళికల్లో ముఖ్యమైన అంశమని తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రానందున ఇప్పటివరకు ఒక్క టెర్మినల్ కూడా లేదని సంజయ్ భార్గవ వెల్లడించారు.