Megha Swaroop: ఐపీఎస్ ట్రైనింగ్ పొందుతూ ఐఏఎస్ కు సెలెక్ట్ అయిన కర్నూలు కుర్రాడు!

  • గత సివిల్స్ పరీక్షలో 98వ ర్యాంక్ సాధించిన మేఘస్వరూప్
  • నేషనల్ పోలీస్ అకాడెమీలో ఐపీఎస్ ట్రైనింగ్ పొందుతున్న వైనం
  • ఈసారి సివిల్స్ లో 31వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కు ఎంపికైన మేఘస్వరూప్
Kurnool man selected for IAS

కర్నూలు జిల్లాకు చెందిన మేఘస్వరూప్ పట్టుదలతో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. గత ఏడాది నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో 98వ ర్యాంకును సాధించిన ఆయన ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యారు. ప్రస్తుతం హైదరాబాదులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఆయన ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు.

అయితే ఐఏఎస్ అధికారి కావాలనేది ఆయన లక్ష్యం. దీంతో ఐపీఎస్ ట్రైనింగ్ పొందుతూనే, పట్టుదలతో మరోసారి సివిల్స్ కు ప్రిపేరై... సివిల్స్ 2020లో 31వ ర్యాంకును సాధించారు. దీంతో, ఐఏఎస్ కావాలనే తన కలను నెరవేర్చుకున్నారు. మేఘస్వరూప్ తండ్రి పంజాబ్ పవర్ గ్రిడ్ లో ఉన్నతాధికారిగా పని చేస్తున్నారు. ఆయన తాత రామలింగారెడ్డి కర్నూలు జిల్లాలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యారు.

More Telugu News