Bhadradri Kothagudem District: పురుగుల మందు తాగిన ప్రేమ జంట‌.. అమ్మాయి మృతి

  • భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ఇల్లెందు మండ‌లం నెహ్రూన‌గ‌ర్‌లో ఘ‌ట‌న‌
  • కొన్నేళ్లుగా ప్రేమించుకుంటోన్న యువతి, యువ‌కుడు
  • మృతురాలు డిగ్రీ విద్యార్థిని శ్వేత‌గా గుర్తింపు
lovers attempt suicide

ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. దీంతో అమ్మాయి ప్రాణాలు కోల్పోగా, అబ్బాయి ప్రాణాపాయ‌స్థితిలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషాద ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా ఇల్లెందు మండ‌లం నెహ్రూన‌గ‌ర్‌లో చోటు చేసుకుంది.

పురుగుల మందు తాగిన యువ‌కుడి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, స్థానిక ఆసుప‌త్రిలోని వైద్యులు చెప్ప‌డంతో అత‌డికి మెరుగైన‌ చికిత్స అందించ‌డానికి ఖ‌మ్మం ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతురాలి పేరు బోడ శ్వేత‌(20)గా గుర్తించారు. ఆమె స్థానికంగా ఉండే ఓ కాలేజీలో డిగ్రీ చ‌దువుతోంది. కొన్నేళ్లుగా గుగులోత్ వెంక‌టేశ్ అనే యువ‌కుడిని ప్రేమిస్తోంద‌ని తెలుస్తోంది.

More Telugu News