Godavari Boat Accident: రెండేళ్ల క్రితం ఇద్దరు కుమార్తెలు చనిపోయిన రోజే.. కవలలు జననం!

  • విశాఖపట్టణానికి చెందిన దంపతుల ఇంట అద్భుతం
  • రెండేళ్ల క్రితం గోదావరిలో పడవ ప్రమాదం
  • చనిపోయిన 50 మందిలో ఈ దంపతుల ఇద్దరు కుమార్తెలు
  • సరిగ్గా రెండేళ్ల తర్వాత వారి ఇంట కవలల జననం
couple have twins on the same day when they lost their daughters 2 years ago

విధి నాటకం అంటే ఇదేనేమో? రెండేళ్ల క్రితం సరిగ్గా అదే రోజున ఆ ఇంట విషాదం తాండవం చేసింది. ఇద్దరు కుమార్తెలను పడవ ప్రమాదంలో కోల్పోయిన ఆ తల్లిదండ్రులు గుండెలు పిక్కటిల్లేలా ఏడ్చారు. ఇదిగో ఇప్పుడు రెండేళ్ల తర్వాత ఆ ఇంట నవ్వులు పూస్తున్నాయి. ఇద్దరు ఆడపిల్లలకు ఆ తల్లి జన్మనిచ్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం అంటే 2019 సెప్టెంబరు 15న గోదావరి నదిలో పడవ ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో సుమారు 50 మంది మరణించారు. వారిలో విశాఖపట్టణానికి చెందిన ఒక కుటుంబంలోని ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. రెండేళ్ల తర్వాత ఈ ఏడాది అదే సెప్టెంబరు 15న ఆ దంపతులకు కవలలు పుట్టారు. ఈ ఇద్దరు పిల్లలు కూడా ఆడపిల్లలే కావడం విశేషం. పండంటి పిల్లలకు జన్మనిచ్చిన ఆ తల్లి తనకు చాలా సంతోషంగా ఉందని, ఇది తమకు దేవుడిచ్చిన వరమని అంటోంది.

More Telugu News