tanish: టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం: విచార‌ణ‌కు హాజ‌రైన త‌నీశ్‌

  • ఇప్ప‌టికే ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖుల‌ను విచారించిన అధికారులు
  • నేడు త‌నీశ్‌ బ్యాంకు ఖాతాల ప‌రిశీల‌న‌
  • డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాదారుల‌తో సంబంధాలపై ఆరా
tanish before ed on drugs case

టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలో జ‌రిగిన లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఈ రోజు సినీ న‌టుడు త‌నీశ్‌ను విచారిస్తున్నారు. ఈ  కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఇప్ప‌టికే అధికారులు టాలీవుడ్ ప్ర‌ముఖులు పూరి జగన్నాథ్, చార్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, ర‌వితేజ, న‌వ‌దీప్, ముమైత్ ఖాన్‌ లను విచారించిన విష‌యం తెలిసిందే.

ఈ కేసులో నోటీసులు అందుకున్న నేప‌థ్యంలో త‌నీశ్‌ హైద‌రాబాద్‌లోని ఈడీ కార్యాల‌యంలో అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌రయ్యాడు. ఆయ‌న‌కు సంబంధించిన‌ బ్యాంకు ఖాతాల‌ను అధికారులు ప‌రిశీలిస్తున్నారు.  డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాదారుల‌తో త‌నీశ్‌కు ఉన్న‌ సంబంధాలు, జ‌రిపిన సంప్ర‌దింపుల‌పై విచారిస్తున్నారు. డ్ర‌గ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జ‌రిగాయ‌న్న విష‌యంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

More Telugu News