Telangana: తెలంగాణలో మరో 296 మందికి కరోనా పాజిటివ్

Telangana corona update
  • గత 24 గంటల్లో 69,833 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 74 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 5,324 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 69,833 కరోనా పరీక్షలు నిర్వహించగా, 296 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 74 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 29, వరంగల్ అర్బన్ జిల్లాలో 22 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 322 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,61,302 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,52,085 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,324 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మరణాల సంఖ్య 3,893కి పెరిగింది.
Telangana
Corona Virus
Positive Cases
Deaths

More Telugu News