Charan: 'జెర్సీ' దర్శకుడితో చరణ్ మూవీ ఖాయమైనట్టే!

  • ముగింపు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • విడుదలకి రెడీ అవుతున్న 'ఆచార్య'
  • సెట్స్ పైకి వెళ్లనున్న శంకర్ సినిమా
  • 'జెర్సీ' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్
Charan in Goutham Thinnanuri movie

ఒక వైపున హీరోగా 'ఆర్ ఆర్ ఆర్' వంటి పాన్ ఇండియా సినిమా, మరో వైపున నిర్మాతగా 'ఆచార్య' వంటి భారీ ప్రాజెక్టుతో చరణ్ తీరిక లేకుండా గడిపాడు. ఇక కరోనా కారణంగా ఎప్పటికప్పుడు ప్లానింగ్ మారిపోతున్నా, అందుకు తగిన విధంగా మార్పులు చేసుకుంటూ ఆయన సాగాడు.

అలాంటి చరణ్ ఇక శంకర్ సినిమా నుంచి తన దూకుడు పెంచనున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 8వ తేదీన శంకర్ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తరువాత చరణ్ ఏ దర్శకుడితో చేయనున్నాడు? అనే ప్రశ్నకి సమాధానంగా 'జెర్సీ' దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పేరు వినిపిస్తోంది.

కొంతకాలం క్రితమే ఆయన చరణ్ కి ఒక కథను చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ కథకి చరణ్ ఓకే చెప్పాడనేది తాజా సమాచారం. శంకర్ తరువాత చరణ్ చేయనున్న సినిమా ఇదేనని అంటున్నారు. గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ విషయంలో బిజీగా ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.

More Telugu News