మైనర్ను బలవంతంగా పెళ్లి చేసుకొని, సన్నిహితంగా గడిపిన యువతి.. పోలీసు కేసు!
- తమిళనాడులో వెలుగు చూసిన ఘటన
- పొల్లాచ్చిలో పెట్రోలు బంకులో యువతి ఉద్యోగం
- 17ఏళ్ల యువకుడితో ప్రేమ
- గుడికి తీసుకెళ్లి బలవంతంగా తాళి కట్టించుకున్న వైనం
- యువకుడి తల్లి కేసు పెట్టడంతో యువతి అరెస్టు
ఈ క్రమంలో యువకుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కోయంబత్తూర్ వెళ్లి ఆ జంటను పొల్లాచ్చికి తీసుకొచ్చారు. తన ప్రియురాలు గుడికి తీసుకెళ్లి బలవంతంగా తాళి కట్టించుకుందని ఆ యువకుడు చెప్పాడు. ఆ తర్వాత తనతో సన్నిహితంగా గడపడం ప్రారంభించిందని వివరించాడు. దీంతో ఆ యువతిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. యువకుడిని నమ్మించి పెళ్లి చేసుకున్న కేసులో యువతి అరెస్టు కావడం ఇదే తొలిసారని స్థానిక ఎస్పీ సెల్వనాగరత్నం చెప్పారు.