దురాక్రమణకు యత్నించిన తాలిబన్లకు దీటుగా బదులిచ్చిన పంజ్ షీర్ యోధులు
- మరోసారి దాడికి దిగిన తాలిబన్లు
- లొంగేదిలేదంటున్న పంజ్ షీర్ లోయ
- తాలిబన్లను ఎదుర్కొన్న ప్రతిఘటన దళాలు
- 8 మంది తాలిబన్ల మృతి
ఈ పోరాటంలో 8 మంది వరకు తాలిబన్లు హతమయ్యారని పంజ్ షీర్ దళాలకు చెందిన ఫహీమ్ దాష్తి వెల్లడించారు. తాలిబన్ల దాడిని తిప్పికొట్టామని, ఈ దాడిలో పలువురు ప్రజలతో పాటు ఇద్దరు ప్రతిఘటన దళ సభ్యులు కూడా గాయపడ్డారని దాష్తి వివరించారు. కాగా, ఈ ఘటనపై తాలిబన్లు ఇప్పటివరకు స్పందించలేదు.