Telangana: ఎవరూ దాడి చేయలేదు.. తనకు తానే గొంతు కోసుకుంది: కామారెడ్డి ఘటనపై పోలీసులు

  • 9 నెలల క్రితం వివాహం
  • 2 నెలల క్రితం ఆత్మహత్యాయత్నం
  • ప్రేమ వ్యవహారమే కారణమన్న అనుమానం
Shocking Update Into Kamareddy Attack Incident

కామారెడ్డి దాడి ఘటనలో పోలీసులు షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి తనపై దాడి చేశాడన్న యువతి మాటలు బూటకమని తేల్చారు. ఆమెకు 9 నెలల క్రితం కామారెడ్డికి చెందిన యువకుడితో వివాహమైందని పోలీసులు చెప్పారు.

అయితే, అంతకుముందు ప్రేమ వ్యవహారం వల్లే ఆమె తనకు తాను గొంతుకోసుకుని ఈ నాటకమాడి ఉంటుందని వారు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితమూ ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిందని తెలిపారు. ప్రస్తుతం ఆమెకు కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు.

More Telugu News