తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆరోగ్యశ్రీలోకి కరోనా!
- కేంద్ర 'ఆయుష్మాన్ భారత్'లో ఇప్పటికే కరోనా చికిత్స
- రాష్ట్రంలో ‘ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్ భారత్’ పేరిట అమలు
- 17 రకాలుగా కరోనా చికిత్స విభజన
కాగా, రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలుతో మొత్తం 1,668 జబ్బులకు ఉచిత వైద్యం అందుబాటులోకి వచ్చింది. వీటిలో 642 చికిత్సలను ప్రస్తుతానికి ప్రభుత్వాసుపత్రుల్లోనే అందించాలని నిర్ణయించారు. 50 పడకలున్న ఆసుపత్రులకు మాత్రమే ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి అనుమతి లభిస్తుండగా, ఆయుష్మాన్ భారత్ చేరికతో ఆరు పడకలున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు, 30 పడకలున్న సామాజిక ఆరోగ్య కేంద్రాల్లోనూ ఆరోగ్య శ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.