Boy: రాజేంద్రనగర్ బాలుడి అదృశ్యం విషాదాంతం... చెరువులో శవమై తేలిన చిన్నారి

  • నిన్నటి నుంచి బాలుడి మిస్సింగ్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
  • చెరువులో విగతజీవుడిలా బాలుడు
  • హత్య చేసి ఉంటారని భావిస్తున్న పోలీసులు
Boy went missing in Hyderabad found dead in lake

హైదరాబాదులోని రాజేంద్రనగర్ కు చెందిన ఓ బాలుడు నిన్నటి నుంచి కనిపించకుండా పోవడం తెలిసిందే. ఆ బాలుడి అదృశ్యం విషాదాంతం అయింది. ఆ చిన్నారి రాజేంద్రనగర్ సమీపంలోని ఓ చెరువులో శవమై తేలాడు. ఆడుకుంటూ వెళ్లి మళ్లీ ఇంటికి రాని తమ బిడ్డను ఆ స్థితిలో చూసిన తల్లిదండ్రులు అబ్దుల్ రహీమ్, తబస్సుమ్ వేదన వర్ణనాతీతం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఆ చిన్నారిని చంపేసి చెరువులో పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికులను సైతం విషాదానికి గురిచేసింది.

More Telugu News