drug: అన్నింటికీ తలరాత బాగుండాలి!: డ్ర‌గ్స్ కేసు నిందితురాలు న‌టి సంజన త‌ల్లి వ్యాఖ్య‌లు

  • ప్ర‌స్తుతం అనారోగ్యంతో ఆసుప‌త్రిలో సంజ‌న‌ ‌
  • తాము త‌ప్పు చేయ‌లేద‌న్న సంజ‌న త‌ల్లి
  • తాము పేదలకు రోజూ అన్నదానం చేస్తున్నామ‌ని వ్యాఖ్య‌
sanjana mother on drugs case

కన్నడ సినీ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన డ్రగ్స్ కేసును ఎదుర్కొంటోన్న విష‌యం తెలిసిందే. మరోపక్క, ప్ర‌స్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న సంజన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోంది. ఈ నేప‌థ్యంలో సంజన తల్లి రేష్మా గల్రాని మాట్లాడుతూ.. అన్నింటికీ తలరాత బాగుండాలని అన్నారు. తాము ఎటువంటి తప్పూ చేయలేదని చెప్పారు. తాము పేదలకు రోజూ అన్నదానం చేస్తున్నామ‌ని అన్నారు.

అలాగే, నటి రాగిణి ద్వివేది కూడా డ్ర‌గ్స్ కేసుపై స్పందిస్తూ... భ‌గ‌వంతుడు వేసిన ప్లాన్‌పై మనకు భరోసా ఉండాలని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ఆత్మవిశ్వాసం ఉంటేనే  మ‌నం గెలుస్తామంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ఆమె మీడియా ముందుకు రావ‌డానికి ఒప్పుకోవ‌ట్లేదు. త‌న‌ లాయ‌ర్‌తో మాత్రమే ఆమె మాట్లాడుతున్నారు.

More Telugu News